ChandraBabu online Meeting with Vizak TDP Leaders: విశాఖ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో చంద్ర‌బాబు ఆన్‌లైన్ స‌మావేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు కమిటీల బాధ్యులతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి, ఆర్ధిక రాజధాని విశాఖ అని ఆ రోజే అసెంబ్లీలోనే చెప్పాం

విశాఖకు వచ్చే పెట్టుబడులన్నీ వైసిపి పోగొట్టింది

పెట్టుబడుల గమ్యస్థానంగా మేము చేస్తే, రౌడీ దందాల అడ్డాగా వైసిపి చేసింది

స్వంత దుకాణాలు, స్వంత బ్రాండ్లతో జనాన్ని లూటీ చేయడమే మద్య నిషేధమా..? 

టిడిపి ఇచ్చిన రూ10,500కోట్ల విలువైన ఇంటిజాగాల్లో రూపాయి అవినీతి జరిగిందా..?

ఈ రోజు కేబినెట్ లో కోవిడ్ పై కనీసం సమీక్ష చేయరా..?

ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్క లేదా..? ప్రజారోగ్యం పట్ల ఆమాత్రం బాధ్యత లేదా..?

ఇది ప్రాణాలు కాపాడే సందర్భమా..? కక్ష సాధించే సందర్భమా..?

ఎంత భయపెడితే అంత తిరగబడతారని వైసిపి గుర్తుంచుకోవాలి

శాంత స్వభావులైన విశాఖ వాసులు వైసిపి అరాచకాలను చూసి భయపడే పరిస్థితి

వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి అండగా ఉండాలి

రాబోయే 100రోజులు పార్టీ కార్యకలాపాలపై నిర్దేశం

Show Full Article
Print Article
Next Story
More Stories