జాయింట్ సి పి అవినాష్ మహంతి.. ఓఎల్ఎక్స్ కేస్... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జాయింట్ సి పి అవినాష్ మహంతి.. ఓఎల్ఎక్స్ కేస్ అప్డేట్..

👉 OLX నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ధైర్య సాహసాలు.

👉 OLX లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది ముఠాను తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

👉ఈ ముఠా ఇంతకు ముందు బంగారం దొంగతనాలకు పాల్పడేవారు.

👉ఇప్పుడు టెక్నాలజీ వాడుతూ.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

👉హైదరాబాద్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాలోని కళ్యాణ్ పూరి చౌవేరా గ్రామాలకు వెళితే ఊర్లో వాళ్ళు, మహిళలు పోలీసులపై దాడులు చేశారు.

👉తాజాగా OLX మోసాలు భారీగా పెరగడంతో.. రాజస్థాన్ భరత్ పూర్ జిల్లా పోలీసుల సహాయంతో నిందితులకు చెందిన రెండు గ్రామాలపై దాడులు చేశాం.

👉ఈ క్రమంలో అక్కడి గ్రామస్తులు, మహిళలు పోలీసుల పై దాడులు చేసి, రాళ్లు రువ్వారు, కారం పొడి చల్లారు.

👉అయినప్పటికీ పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించి.. 18 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

👉ఈ ముఠా పై పిడి యాక్ట్ నమోదు చేస్తాం.

👉ఇకపై సైబర్ నేరస్తుల పై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టి.. ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

Show Full Article
Print Article
Next Story
More Stories