అమరావతిమాజీ మంత్రి అఖిల... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 09:38:10

అమరావతి


మాజీ మంత్రి అఖిల ప్రియ


వైసీపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సంపాదనపై దృష్టిపెట్టింది


రాష్ట్రంకోసం, ప్రజల సంక్షేమం కోసం భూములిచ్చిన రైతులపై కక్షసాధింపులకు పాల్పడటం ఏమిటి..?


అమరావతికోసం రైతులు, మహిళలు 300 రోజుల నుంచీ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు.


అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేవారు, అధికారంలో ఉండికూడా ఎందుకు నిరూపించలేకపోయారు.


విశాఖను రాజధానిగా ప్రకటించాక అక్కడ 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.


కర్నూల్లో హైకోర్టు పెట్టడం అనేది ప్రభుత్వం చేతిలో లేదు.


రాయలసీమకు హైకోర్ట్ వచ్చినంత మాత్రాన అక్కడి ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయా..? రైతుల జీవితాలు బాగుపడతాయా..?


ప్రజలు వారిలో వారే కొట్టుకొని చచ్చేలా చేస్తూ, వైసీపీ ప్రభుత్వం సంపాదనే ధ్యేయంగా అవినీతిపాలన సాగిస్తోంది.


ఆఖరికి తమస్వార్థంకోసం కులాలు, మతాల మధ్యన చిచ్చుపెట్టాలని చూస్తున్నారు.


అమరావతి రైతులను రోడ్లపాలుచేసినవారు, రాయలసీమకు న్యాయం చేస్తారంటే ఎవరు నమ్ముతారు?


చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడింది.


వైసీపీకి ఓటేసినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.


రాష్ట్రమంతా అమరావతి రైతులకు మద్ధతుగా నిలవాలి.


HMTV

HMTV

Next Story