దేవినేని ఉమ, మాజీమంత్రివసంత కృష్ణప్రసాద్ 1999లో... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

దేవినేని ఉమ, మాజీమంత్రి

వసంత కృష్ణప్రసాద్ 1999లో నాపై పోటీచేసి ఓటమి పాలై, హైదరాబాద్ వెళ్లి, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు

కృష్ణప్రసాద్ అతని కుటుంబం ఎక్కడున్నా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు.

సీబీఐ, ఈడీ కేసుల్లో వసంత కృష్ణప్రసాద్ ముద్దాయిగా ఉన్నాడు.

జగన్ అక్రమాస్తులకేసుల్లో అతను కూడా ఒకడు.

తనపైఉన్న సీబీఐ, ఈడీ కేసులు వివరాలను కృష్ణప్రసాద్ ఎన్నికల అఫిడవిట్ లో చూపలేదు.

అటువంటి వ్యక్తి సిగ్గులేకుండా శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ వేలట్రిప్పుల గ్రావెల్ ను అమ్ముకుంటున్నాడు.

దాన్ని అడ్డుకున్నాననే నాపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడు.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందని ఏసీబీ దాడులతోనే తేలిపోయింది.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంపై రెండురోజులుగా ఏసీబీ దాడులు జరుగతున్నందుకు కృష్ణప్రసాద్ సిగ్గుపడాలి.

అతని అవినీతివల్ల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ సూపరిండెంట్ బలికాబోతున్నారు.

వసంత, అతని బావమరిది ముంపు భూములు కొని, వాటిని మెరకచేయడంకోసం అటవీభూమిని కొల్లగొట్టారు.

సజ్జా అజయ్ పై దాడిచేసింది కృష్ణప్రసాద్ గూండాలే.

తాడేపల్లి రాజప్రాసాదానికి వస్తా.. రా నీ అవినీతిపై తేల్చుకుందామంటే కృష్ణప్రసాద్ పత్తాలేడు.

జగన్ తన అవినీతిని పసిగట్టి, ఏసీబీని వదిలాడన్న నిస్పృహతో కృష్ణప్రసాద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

నోట్లు చించి 18వేలమందికి పంచి, గెలిచాక రూ.2వేలు ఇస్తానన్న విషయాన్ని కూడా వసంత, సీబీఐకి లేఖ రాయాలి.

కృష్ణప్రసాద్ బంధువు టీచర్ పొదిల రవి హత్య కేసు విచారణ కూడా సీబీఐకి అప్పగించాలి.

ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్ మిడిసిపడటం మానేసి, తన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories