శ్రీకాకుళం జిల్లా..సంతబొమ్మాళి... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

శ్రీకాకుళం జిల్లా..


సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి లో దారుణం.


ప్రియుడి చేతిలో మోసపోయిన యువతిని లైంగికంగా వేధిస్తున్న కుల పెద్దలు.


కోరిక తీర్చాలంటూ యువతి పై కుల పెద్దల ఒత్తిడి.


కుల పెద్దల వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.


తనకు కుల పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు.


రెండు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే యువకుడ్ని ప్రేమించిన యువతి.


ప్రేమించి పెళ్ళికి నిరాకరించిన లక్ష్మణరావు.


దీనితో మూడు నెలల క్రితం కుల పెద్దలను ఆశ్రయించిన యువతి కుటుంబ సభ్యులు.


బాధితురాలు మైనర్ కావడంతో కుల పెద్దల సమక్షంలో రాజీకు ఒప్పుకున్న లక్ష్మణరావు.


లక్ష్మణరావు నుండి 18 లక్షలు వసూలు చేసిన కుల పెద్దలు.


బాధితురాలు కుటుంబానికి 8 లక్షలు ఇచ్చి 10 లక్షలు స్వాహా చేసిన కుల పెద్దలు.


మరికొంత డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణరావు పై ఒత్తిడి.


కుల పెద్దల ఒత్తిడి కి చేతులేత్తేసిన లక్ష్మణరావు.


10 లక్షల స్వాహా విషయం చెప్పకుండా బాధితురాలితో పోలీసులకు ఫిర్యాదు చేయించిన కుల పెద్దలు.


యువతి ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.


ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి లక్ష్మణరావు ను అరెస్ట్ చేసిన పోలీసులు.


45 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన లక్ష్మణరావు.


కేసు సెటిల్మెంట్ కు కుల పెద్దలకు 18 లక్షలు ఇచ్చానని లక్ష్మణరావు చెప్పడంతో అవాక్కైన యువతి.


18 లక్షలు పరిహారం చెల్లించిన ప్రియుడ్ని జైలుకు పంపించడం పై కుల పెద్దలను నిలదీసిన యువతి.


మిగిలిన డబ్బు కావాలంటే తమ కోర్కెలు తీర్చాలంటూ యువతి పై ఓ కుల పెద్ద ఒత్తిడి.


బయటకు చెప్తే చంపేస్తామని వార్నింగ్.


యువతి ఇటీవల మేజర్ కావడంతో జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు.


Show Full Article
Print Article
Next Story
More Stories