బ్రేకింగ్ న్యూస్... ఆన్ లైన్ బెట్టింగ్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

బ్రేకింగ్ న్యూస్...

ఆన్ లైన్ బెట్టింగ్ పాల్పడినవారిని అరెస్ట్ చేసిన కేసు తెలిసిన విషయమే.

వీరు ఎన్ని బ్యాంకులకు ట్రాన్సాక్షన్ చేశారు మరిన్ని కంపెనీల లావాదేవీలు జరిగాయి అని.

సమగ్ర విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసిన సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.

4 రోజుల కస్టడీ కి ఇచ్చిన నాంపల్లి న్యాయస్థానం. చంచల్ గూడ జైలు నుండి వారంటే పై ఒక చైనా దేశస్థుడు పాటు మరో ముగ్గురు వ్యక్తులను జైలు నుండి సిసిఎస్ కు తీసుకువచ్చిన పోలీసులు.

నలుగురు వ్యక్తులు ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ స్కాం లో ఎంతమంది ఉన్నారో అనే కోణం మీద దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు.

పదకొండు వందల కోట్ల రూపాయలు చైనాలోని బీజింగ్ టుమారో కంపెనీ కీ బదలీ చేయడంపై దృష్టి..

రెండు అకౌంట్లు ద్వారా హెచ్ ఎస్ బి సి బ్యాంకు అమౌంట్ బదిలీ చేసినట్లు నిర్ధారణ..

ఆన్లైన్ బెట్టింగ్ వచ్చిన డబ్బులు పేటీఎంలో డిపాజిట్ చేయించిన చైనా కంపెనీ.

2019 లో కేవలం ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన చైనా కంపెనీ.

ఈ ఏడాది ఆరు మాసాల్లో 1102 కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన బీజింగ్ టుమారో కంపెనీ..

లాక్ డౌన్ లోనే ప్రజల సొమ్ముని ఆన్లైన్ బెట్టింగ్ కొట్టేసిన చైనా కంపెనీ.

అయితే విచారణలో మరి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

నిందితులు పోలీసులకు సహకరిస్తే మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది...

Show Full Article
Print Article
Next Story
More Stories