- ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమెశ్ కుమార్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరియు వరదల నేపధ్యంలో వాటిపై తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో బిఆర్ కెఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

- ఇంకా కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా అధికారులందరు హెడ్ క్వాటర్స్ లోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్ధితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు.

- జిల్లాల్లో రైల్వే లైన్ లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సి.యస్ అప్రమత్తం చేశారు.

- చెరువులు , కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

- జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్ధితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.

- రాష్ట్ర స్ధాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు అయిందని ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్న (040-23450624) కు కాల్ చేయవచ్చ.

- జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి.

- అదనంగా గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలి.

Show Full Article
Print Article
Next Story
More Stories