జాతీయం: - రాజస్థాన్ అసెంబ్లీ లో మూజువాణి ఓటుతో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జాతీయం:

- రాజస్థాన్ అసెంబ్లీ లో మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్ష నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కార్

- ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు చేసిందని బిజెపి ఆరోపణలు చేసిన అశోక్ గెహ్లాట్

- రాజీ ఫార్ములా ఫలించిన అనంతరం రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో భేటీ అయిన మరుసటి రోజు సచిన్‌ పైలట్‌ శుక్రవారం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్ పైలెట్

- రాజస్తాన్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్‌కు దూరంగా విపక్షాలకు దగ్గరగా పైలట్‌కు సీటు కేటాయించడం చర్చనీయాంశం.

- తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై తనదైన శైలిలో స్పందించిన సచిన్ పైలెట్ .

- తనకు బోర్డర్‌లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని వ్యాఖ్యలు

- సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్‌ వ్యాఖ్య

- రాజస్తాన్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష బీజేపీ ప్రకటించగా, పైలట్‌ రాకతో బలోపేతమవడంతో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గెహ్లాట్

- 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్‌ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు

- ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం

-విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories