*పఠాన్ చేరువుడిఎస్పిరాజేశ్వర్ రావు*సంగారెడ్డి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

*పఠాన్ చేరువు

డిఎస్పిరాజేశ్వర్ రావు*

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాము..

ఈ కేసు విచారణ లో వుంది..

ప్రధాన నిందితుడు ఆశ్రమానికి దాతలుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి తో పాటు విజయను జయదేవ్ ను పూర్తిస్థాయిలో విచారించాము.

మైనర్ బాలికపై పలుమార్లు వేణు గోపాల్ రెడ్డి అత్యాచారం చేసినట్లు నిర్ధారించడం జరిగింది.

ఇతనికి వార్డెన్ విజయ ఆమె బ్రదర్ జయ దేవ్ సహకరించారు.

అమ్మాయి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అంతకు ముందే మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.

బాలికకు జరిగిన అన్యాయం గురించి పూర్తిగా వివరించింది.

మైనర్ బాలికతో పాటు మరికొంత మంది చిన్నారుల స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.

లాక్ డౌన్ లో ఈ గతుకం జరిగింది..

మే నెలలో బాలిక బోయిన్ పల్లి లోని కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళింది..

అమ్మాయి ఒంటిపై గాయాలయ్యాయి.

ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాము..

ఒక కేసు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి పై జరిగిన అత్యాచారం.

మరొక కేసు బాలికపై జరిగిన భౌతిక దాడి ఈ విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల ప్రకారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు..

అమ్మాయిపై బంధువులు భౌతిక దాడికి పాల్పడ్డార లేదా హాస్టల్ లో ఎవరైనా దాడికి పాల్పడ్డార అని విచారణ జరుగుతోంది.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది..

ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాము..

పూర్తిస్థాయిలో లో విచారణ చేపడుతున్నాము..

ఇప్పటికే నిందితులపై 2012 పోక్సో ఆక్ట్ ప్రకారం పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశాము..

Show Full Article
Print Article
Next Story
More Stories