అమరావతిఏపీ హైకోర్టును రెడ్ జోన్ గా ప్రకటించాలని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 10:56:13

అమరావతి

ఏపీ హైకోర్టును రెడ్ జోన్ గా ప్రకటించాలని దాఖలైన పిటీషన్ విచారించిన ఏపీ హైకోర్టు

న్యాయమూర్తి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఇంప్లీడ్ పిటిషన్ పై వాదనలు పూర్తి..

మంగళవారానికి వాయిదా వేసిన ధర్మాసనం..

న్యాయమూర్తి రామకృష్ణ ప్రతిరోజు మీడియాలో మాట్లాడుతున్నారని

కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పిటిషనర్ తరఫు న్యాయవాది

రామకృష్ణ సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఆయన జడ్జ్ అని సర్వీస్ రూల్స్ ప్రకారం మీడియాతో మాట్లాడకూడదని వాదనలు

హైకోర్టు కంటోన్మెంట్ జోన్..

రిజిస్టర్ జనరల్ రాజశేఖర్ మరణం పై వేసిన పిటిషన్ కు జడ్జి రామకృష్ణకు సంబంధం లేదని వాదించిన న్యాయవాది

కేంద్రానికి పిటిషన్ తో సంబంధం లేదన్న అదనపు సోలిసిటర్ జనరల్

రాష్ట్ర ప్రభుత్వానికి, జడ్జి ఈశ్వరయ్య కు సంబంధం ఉందని ఇంప్లీడ్ పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు

ఇది వాస్తవం కాదని వాదించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది

హైకోర్టు ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకే ఈ పిటిషన్ వేశారన్న రామకృష్ణ తరపు న్యాయవాది..

కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి వేణుగోపాల గౌడ్ ఈశ్వరయ్య ఆడియో టేపులను జత చేశామన్న రామకృష్ణ తరపు న్యాయవాది

ఆయన వాయిస్ కూడా నిజమేనని తేలిందన్న రామకృష్ణ తరఫు న్యాయవాది..

ఈశ్వరయ్యకు ఈ పిటిషన్ తో సంబంధం ఉందని ఆయన కుట్రలను చేధించేందుకు తాము ఇంప్లీడ్ అవుతున్నామని వాదనలు

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి లతో విచారణ జరిపించాలని కోరిన జడ్జి రామకృష్ణ తరఫు న్యాయవాది

HMTV

HMTV

Next Story