ప్రగతి భవన్సీఎం కేసీఆర్ ను కలిసినమహబూబాబాద్ శాసన... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 12:18:01

ప్రగతి భవన్

సీఎం కేసీఆర్ ను కలిసినమహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్

మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) కి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ జె.రఘోత్తం రెడ్డి 160 ఎకరాల భూమిని, రూ.1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎంకు ఎమ్మెల్యే వివరించిన శంకర్ నాయక్

దీనికి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

నాలుగురోజుల క్రితం రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవీకేను సందర్శించి, నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.

వచ్చే విద్యా సంవత్సరం నుంచే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభిద్దామని సీఎం కేసీఆర్ హామీ

HMTV

HMTV

Next Story