♦ అమరావతి ♦» పవన్... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ అమరావతి 

»  పవన్ కళ్యాణ్.....జనసేన అధినేత.....

- వేదాద్రి దగ్గరి రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం

- కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను.

- మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

- క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

- తెలంగాణలోని పెద గోపవరం గ్రామస్తులు వేదాద్రి నరసింహ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకొందని తెలిసింది.

- ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం, వైద్యం విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సేవలు అందించాలని కోరుతున్నాను.

- లారీ ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారంటే ఎంత తీవ్రంగా ప్రమాదం చోటుచేసుకొందో అర్థం అవుతోంది.

- గ్రామీణ ప్రాంతాల్లో సైతం మితిమీరిన వేగంతో లారీలు, ఇసుక టిప్పర్లు, ఇతర సరుకు రవాణా వాహనాలు తిరుగుతున్నాయని, భయమేస్తోందని ప్రజలు   వాపోతున్నారు.

- రవాణా, పోలీసు శాఖలు ఈ వేగానికి కళ్ళెం వేసి, రహదారి భద్రత నియమాలు అమలు చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories