Boat Accident at Rajahmandry: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘోర ప్రమాదం

- చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ మునక

- లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం

-చీకటి కావటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని పరిస్థితి

- ఘటనా ప్రాంతానికి చేరుకుంటున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు

- చింతూరు మండలం వరద ముంపు గ్రామం కల్లేరు లాంచిలో వెళ్ళిన రెవిన్యూ అధికారులు

- నిత్యావసరాలు బాధితులకు పంపిణీ చేసి వెనక్కి వచ్చిన లాంచీ

ఐటిడిఎ పివో వెంకటరమణ తో సహా చింతూరులో తిరిగి లాంచీ దిగిన రెవిన్యూ సిబ్బంది.

-ఆ తర్వాత లాంచీ వెనక్కి తీసుకువెళ్ళి లంగరు బ్రిడ్జి సమీపంలో వేసుకోవడానీకి మళ్ళింపు

-చీకటి కావడంతో నేరుగా బ్రిడ్జి కి ఢీకొట్టడంతో ముక్కలైన లాంచీ

- అందులో వున్న డ్రైవరు తో సహా ముగ్గురు గల్లంతు

-వారికోసం హుటాహుటీన గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు...

- లాంచీ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురులో ఇద్దరు సురక్షితం క్షేమంగా బయటపడ్డారు.

- కచ్చులూరు వద్ద లాంచీ జలసమాధి ఘటన జరిగి ఏడాది గడవక ముందే గోదావరి వరద ఉధృతి లో మరో ప్రమాదం

- ప్రమాదానికి గురైన లాంచీ పేరు గోదావరి

- తృటిలో భారీ ప్రమాదం తప్పింది అంతకు ముందే లాంచీలో రెవిన్యూ టీం లాంచి దిగారు

Show Full Article
Print Article
Next Story
More Stories