Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధగా ఉంది: బాలకృష్ణ హిందూపురం mla!

అమరావతి..

-ఎస్పీబీ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరని లోటు

-తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమించారన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.

-ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను ప్రతిరోజూ ఆ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేశాను.

-కానీ ఇంతలోనే బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.

-ఎస్పీ బాలసుబ్రమణ్యంతో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.

-నాన్నగారు నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన సుమధుర గానం అందించారు.

-చిత్రం భళారే విచిత్రం అంటూ గంభీరమైన స్వరంతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది.

-ఎస్పీబీ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.

-బాల సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

-ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

Show Full Article
Print Article
Next Story
More Stories