AP Municipal Elections 2021: తిరుపతి 15వ డివిజన్లో టెన్షన్.. టెన్షన్
తిరుపతి 15వ డివిజన్లో ఉద్రిక్తత నెలకొంది. బైరాగి పట్టెడ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు గుమ్మగూడటంతో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మాట మాట పెరగడంతో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపు చేశారు. పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Next Story



