AP Municipal Elections 2021: ఏపీలో ముగిసిన మున్సిపోల్స్ పోలింగ్

HMTV
By HMTV
Published on: 2021-03-10 11:53:34

ఏపీలో:

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగాయి. 16వందల 33వార్డులు, 582 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. విజయనగరం, విశాఖ, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇక, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 శాతం పోలింగ్‌ నమోదైంది. పలుచోట్ల మందకొడిగా పోలింగ్‌ సాగింది. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

HMTV

HMTV

Next Story