AP Municipal Elections 2021: సంతృప్తికరంగా భద్రతా ఏర్పాట్లు: ఎస్‌ఈసీ

HMTV
By HMTV
Published on: 2021-03-10 05:14:16

ఎస్ఈసీ నిమ్మగడ్డ, కలెక్టర్లతో కలిసి పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. విజయవాడలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వాలంటీర్లు వారి ఫోన్లు లేకుండా నిబంధనలను అనుసరిస్తున్నారని చెప్పారు. అధికారులు పోలింగ్ కు చేసిన ఏర్పాట్లపై ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లు సుహృద్భావ వాతావరణంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా చూస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ పిలుపునిచ్చారు.



 


HMTV

HMTV

Next Story