AP Municipal Elections 2021: ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ 14వ వార్డులో ఎంపీ విజయసాయిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మారుతీనగర్ పోలింగ్ బూత్ నెంబర్ 11లో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. జీవిఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. గతంలో గ్రేటర్ విశాఖలో 50 శాతానికి మించి పోలీంగ్ నమోదు కాలేదన్నారు. అయితే ఇప్పుడు అంతకుమించి పోలింగ్ శాతం పెరగాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని మంచి పాలన అందించే కార్పొరేటర్ని ఎన్నుకోవాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

Next Story



