Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 02:22:58

♦ మూడో విడతలో 3వేల 221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

దీంతో మిగిలిన 2వేల 639 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7వేల 757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19వేల553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43వేల612 మంది పోటీలో ఉన్నారు. 

HMTV

HMTV

Next Story