Amaravati Updates: కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్...

అమరావతి

-పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ భాద్యులు .

చంద్రబాబు

-ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.

-రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది.

-బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

-రూ 430కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86% టిడిపి పూర్తిచేసింది.

-123కిమీ కాలువ తవ్వకానికి గాను 121కిమీ పూర్తయ్యింది.

-మిగిలిన 14% పనులను గత 18నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు.

-2నెలల్లో చేయాల్సిన పని, 2సీజన్లు పూర్తయినా, 2ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.

-86% పనులు టిడిపి పూర్తిచేస్తే, మిగిలిన 14% పూర్తి చేయడానికి చేతులు రావా..?

-జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం.

-పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

-ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం.

-అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.

-రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా టిడిపి బాధ్యత.

-ప్రతిపక్షం ప్రజాందోళనలకు పోటీ ఆందోళనలు వైసిపి జరపడం సిగ్గుచేటు.

-నిరసన తెలిపే హక్కు బాధితులకు ఉంది. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు.

-శాంతిని టిడిపి ప్రమోట్ చేస్తే, విధ్వంసాన్ని వైసిపి ప్రమోట్ చేస్తోంది.

-మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ ఇలా దుర్మార్గ పాలన చేయరు.

-ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడటం హేయం.

-చిత్తూరు వైసిపి నాయకులు మిడిసి మిడిసి పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories