92వార్డ్ పద్మనాభ పురం హౌసింగ్ కాలనీ వద్ద టిడిపి నాయకులు నిరసన

గోపాలపట్నం :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

- టీడీపీ ప్రభుత్వ హయాం లో అర్హులైనా పేదలందరికి ఇళ్లులు కేటాయించాడం జరిగింది. పేదలకు చెందాల్సిన ఇల్లులను వైసీపీ ప్రభుత్వం పనులను అసంపూర్తిగా వుంచింది.

- ఉన్న గృహ నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టి పూర్తి చేయాలని మరియుబి ఎల్ సి స్కీము ద్వారా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్దిదారులందరికి వెంటనే బకాయిలు చెల్లించాలి.

- 92వార్డ్ పద్మనాభ పురం హౌసింగ్ కాలనీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

- ఈ నిరసన కార్యక్రమం నందు టీడీపీ 90వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ, 91వ వార్డు ప్రెసిడెంట్ నారిపిన్ని సత్తిరాజు 90వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి శ్రీను89వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి విజయ్, నందవరపు సోములు, యలమంచిలి ప్రసాద్, నరవ పైడిరాజు, మొదలగున్న వారు పాల్గొన్నారు. 



Show Full Article
Print Article
Next Story
More Stories