70 లీటర్ల సారాతో పాటు 3 బైక్ లు స్వాధీనం

కోరుకొండ: రాజమహేంద్రవరం అర్బన్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సూపరిండెంట్ ఏ. రమాదేవి ఆదేశాలతో మంగళవారం కోరుకొండ స్టేషన్ పరిధిలోని జరిపిన విస్తృత దాడులలో రెండు కేసులు నమోదు చేసి, 70 లీటర్ల నాటుసారాతో, ఐదుగురిని అరెస్ట్ చేసి,3 మోటార్ బైకులను సీజ్ చేసినట్లు కోరుకొండ ఎస్ ఈ బి స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలా వీరబాబు తెలిపారు.

- ఆయన తెలిపిన వివరాల ప్రకారం కోరుకొండ మండలం జంబుపట్నం గ్రామానికి చెందిన దాసు బాబు, జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రాజు ల వద్ద నుండి 25 లీటర్ల నాటు సారాతో పాటు, ఒక మోటార్ వాహనాన్ని స్వాధీనం చేస్తున్నామన్నారు.

- అదే విధముగా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వెంకటరమణ మరియు లాజర్ ల ను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 25 లీటర్ల నాటు సారాతో పాటు ఒక మోటారు వాహనాన్ని సీజ్ చేసామన్నారు.

- పట్టుబడ్డ నలుగురు గోవిందపురం గ్రామము నుండి జంభూపట్నం గ్రామానికి సారాను తరలిస్తుండగా కోరుకొండ మండలం జంభూట్నం గ్రామ శివారులో వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

- గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన ప్రసాద్ దగ్గర నుండి 20 లీటర్ల నాటుసారా ఒక మోటార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడులలో కోరుకొండ యస్ఈబి స్టేషన్ ఎస్ఐ బి అప్పారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. 



Show Full Article
Print Article
Next Story
More Stories