ఘనంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు

ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ముమ్మిడివరం, కేసనకుర్రు, కాట్రేనికోన గ్రామాల్లో డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

- కేసనకుర్రులో దివంగత వైఎస్సార్ శిలా విగ్రహాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతు దినోత్సవంను పురస్కరించుకొని భారీ కేక్ ను కట్ చేశారు.

- ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిన్నంరాజు వెంకట్ పతి రాజు, కాశి శ్రీహరి, బుడితి నాగన్న, చికం రాంబాబు, బాబిజి రాజు, పెద్ద బాబు, సలాది సే షారావు తదితరులు పాల్గొన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories