ఎస్ రాయవరం మండలంలో కరోనా సోకిన 7 గురిని చికిత్సకై తరలింపు

HMTV
By HMTV
Published on: 2020-07-20 02:40:47

ఎస్ రాయవరం: మండలంలో కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగిన 7 కేసులను చికిత్సకై ఆదివారం ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. దార్లపూడి గ్రామంలోని నలుగురిని, కొరుప్రోలుకి చెందిన ఇద్దరిని, కొత్తపోలవరంకి చెందిన ఒకరిని చికిత్సకై అనకాపల్లి వద్ద రేబాక పాలిటెక్నిక్ కేంద్రం నందు ఏర్పాటుచేసిన చికిత్సా కేంద్రానికి తరలించినట్లు పెనుగొల్లు వైద్యాధికారి డా. జగదీష్ తెలిపారు. దీంతో ఆయా గ్రామాలలో పారిశుద్య పనులను చేపట్టి సమీప నివాసులకు పెనుగొల్లు పి హెచ్ సి సిబ్బంది పలు సూచనలు చేశారు.

HMTV

HMTV

Next Story