పేకాట శిబిరంపై మెరుపు దాడి... రూ 3,03,770 స్వాధీనం

-సబ్ డివిజన్ లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ యం.

- రవీందర్ నాథ్ బాబు ఆదేశాల మేరకు పేకాట,కోడి పందాలు నిర్వహించే జూధ శిబిరాలపై నిత్యం దాడులు చేస్తూ కటకటాలు లెక్కించేలా చేస్తున్నారు జిల్లా పోలీసు యంత్రాంగం.

- ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం పోలీస్ ప్రత్యేక బృందం ఎస్ఐ జె.వి.రమణ ఆధ్వర్యంలో మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి నందిగామ శివార్లలో మామిడి తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద శిబిరం పై పోలీసులు మెరుపు దాడి చేయగా 3లక్షల 3వేల 770 రూపాయలు స్వాధీనం చేసుకుని,14 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు, అదేవిధంగా ఒక బిఎండబ్ల్యూ కారుతో కలిపి మొత్తం 7 కార్లు,మూడు ద్విచక్ర వాహనాలు,13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని,జూదరుల పై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories