బీమవరం లో 24 నుండి కఠిన ఆంక్షలు

HMTV
By HMTV
Published on: 2020-07-23 04:48:48

భీమవరం: భీమవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో తేదీ.24.7.2020 నుండి 31.7.2020 వరకు కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరం రూరల్, అర్బన్ ప్రాంతాలలో covid 19 పొజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నందున ఆయా ప్రాంతాలలో కూరగాయలు, కిరణ, మంగళవారం, గురువారం, శనివారం ఉదయం 6.00 నుండి 10. గంటల వరకు, పాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, మెడికల్ షాపులు.

ప్రతిరోజు 50% షాపులు ఒకరోజు మిగిలిన 50% షాపులు మరొక రోజు ఉదయం 6 గంటల నుండి ఒంటి గంట వరకు ,కొన్ని ప్రాంతాలలో కొన్ని మెడికల్ షాపులు 24 గంటలు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు. పైన తెలిపిన సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు ఆ ప్రకటనలో తెలిపారు.  



HMTV

HMTV

Next Story