తునిలో మరో 17 పాజిటివ్ కేసులు నమోదు

HMTV
By HMTV
Published on: 2020-07-25 15:45:14

తుని: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తలు వహించాలని తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు విజ్ఞప్తి చేశారు.

తాజాగా బ్యాంక్ కాలనీ మార్కేండ్రాజుపేట ముక్త లింగయ్య వీధిలతో పాటూ పలు ప్రాంతాల్లో సుమారు 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.





HMTV

HMTV

Next Story