సింహాచలం దేవస్థానంలో 140 ఒప్పంద ఉద్యోగుల తొలగింపు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పని చేస్తున్న 140 మంది ఒప్పంద ఉద్యోగులను దేవస్థానం తొలగించింది.

- నిర్వహణ కష్టం కావటం.. కరోనా వైరస్ వల్ల భక్తుల రాక తగ్గడంతో ఉద్యోగులను తొలగిస్తున్నామని, అధికారులు తెలిపారు.

- స్వామివారి గోశాలలో ఈ ఒప్పంద ఉద్యోగులను తొలగించటం వల్ల గోవుల సంరక్షణ లేక గోవులను చూసే బాధ్యతను సానిటరీ సిబ్బందికి అప్పజెప్పారు.

- వారికి ఈ నిర్వహణ తెలియకపోవటంతో గోవులకు రెండు రోజులుగా పాలు పితకటం లేదు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఒప్పంద ద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories