రైతులకు కేంద్రం శుభవార్త.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!

- అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

- పలు రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

- 2020-21 మార్కెటింగ్ సీజన్‌లో మద్దతు ధరలను 50 శాతం నుంచి 83 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ తెలిపారు.

- 14 రకాల ఖరీఫ్ పంటలకు ఇది వర్తించబోతుందని ఆయన వివరించారు.

- ఈ క్రమంలో ప్రొద్దు తిరుగుడుకు రూ.5885(100 కేజీలకు), హైబ్రిడ్ జొన్నకు రూ.2,620(100 కేజీలకు), మొక్కజొన్నకు రూ.1,850(100 కేజీలు), కందిపప్పుకు రూ.6000(100 కేజీలకు) మద్దతు ధరగా ఉండబోతున్నట్లు పేర్కొన్నారు.

- అలాగే రైతులు తీసుకున్న రుణాల గడువు పెంచుతామని, ఆగష్టు లోపు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించొచ్చని స్పష్టం చేశారు.

 



Show Full Article
Print Article
Next Story
More Stories