తిరుపతి లో 14 రోజుల పాటు లాక్‌డౌన్!

- తిరుపతిలో కొవిడ్‌ కేసుల తీవ్రత దృష్ట్యా మంగళవారం నుంచి ఆగస్టు 5వ తేది వరకు.. 14 రోజులపాటు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయి.

- ఈ మేరకు తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి, కమిషనరు గిరీషతో కలిసి కలెక్టర్‌ భరత్‌గుప్తా మీడియాతో మాట్లాడారు.

- తిరుపతిలో 50 వార్డుల్లోనూ 20 కేసులు దాటాయని, కొన్నింట్లో 40 కూడా ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.

- నగరమంతా కంటైన్‌మెంట్‌ జోన్‌గా మారిందన్నారు. అన్ని వ్యాపారాలు ఉదయం 11 గంటలకే అనుమతి ఉంటుందన్నారు.

- వైద్య అవసరాల కోసం ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పాల కేంద్రాలు ఉంటాయ న్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బ్యాంకుల సహా అన్నింటినీ మూత వేయాల్సిం దేనన్నారు.

- ఈ నెలాఖరున పరిస్థితిపై సమీక్షించి మరోసారి నిర్ణయం ఉంటుందని తెలిపారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories