ఆగష్టు 1 నుంచి పర్యాటకం.. ఏపీ మంత్రి అవంతి వెల్లడి

- కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు.

- ఆ ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, శిల్పారామం, సాంస్కృతిక విభాగాలపై ఆయన సమీక్ష జరిపారు.

- అనంతరం విలేకరులతో మాట్లాడారు. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా గ‌త మూడు నెల‌ల నుంచి అన్ని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను మూసివేసిన విష‌యం విదిత‌మే.

- ఇటీవ‌ల విడుద‌ల చేసిన కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ఆగ‌స్టు 1 నుంచి సంద‌ర్శ‌కుల కోసం తెరుస్తామ‌ని ఆ రాష్ర్ట ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మంగ‌ళ‌వారం మీడియాకు వెల్ల‌డించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories