రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

విశాఖపట్నం: రైతు, కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గండినాయనబాబు ఆరోపించారు. జగదాంబకూడలిలోని సీఐటీయూ కార్యాలయ ఆవరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. పంట రుణాల రికవరీని తక్షణమే ఆపాలన్నారు. ఖరీఫ్‌లో పెట్టుబడులు కోసం కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, శ్రీను, రాజు పాల్గొన్నారు.



 


Show Full Article
Print Article
Next Story
More Stories