ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీస్తారా ?: వంగలపూడి అనిత

అమరావతి: ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీస్తారా..అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 

వైసీపీ రంగులేసిన స్కూలుబ్యాగులు, యూనిఫామ్ పంపిణీ కోసం పాఠశాలలు తెరవాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వం

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నసమయంలో ప్రభుత్వం ప్రచారార్భాటంతో స్కూళ్లు తెరవాలనుకుంటోంది

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులే మాస్కులు లేకుండా తిరుగుతుంటే, చిన్నపిల్లలు ఎలా ధరిస్తారు?

విద్యార్థుల భవిష్యత్ గురించి పాలకులు అంతగా ఆలోచిస్తుంటే, వాలంటీర్ల ద్వారా పుస్తకాలు, బ్యాగులు, పంపిణీ చేయాలి.

ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల వారు ఆన్ లైన్లో క్లాసులు నిర్వహిస్తుంటే, ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించదు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సెల్ ఫోన్లు పంపిణీచేసి, ఆన్ లైన్ విధానంలో బోధన చేయాలి.

కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రభుత్వం ఇటువంటి తలతిక్క ఆలోచనలు చేయడం మానుకుంటే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories