సముద్రంలో గల్లంతైన బోట్ ఆచూకీ లభ్యం..

తూర్పు గోదావరి: పిఠాపురం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ కు చెందిన సముద్రంలో గల్లంతైన బోట్ ఆచూకీ లభ్యం..

బంగాళాఖాతంలో గల్లంతయిన మత్స్యకారులు క్షేమం..

అల్పపీడనం కారణంగా గాలి వాటానికి విశాఖ తీరానికి చేరుకున్న బోటు.

సెల్ ఫోన్ ద్వారా తమ బంధువులకు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు.

 మరి కాసేపట్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరనున్న మత్య్సకారులు 

ఈ నెల 11న వేటకు వెళ్లి గల్లంతు అయిన నలుగురు మత్య్సకారులు 

వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన  అధికారులు

ఎట్టకేలకు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం. 

మత్స్యకారుల క్షేమ సంచారం తో ఊపిరి పీల్చుకున్న వారి బంధువులు.

గాలింపు చర్యలలో సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన పెండెం దొరబాబు శాసన సభ్యులు , పిఠాపురం

Show Full Article
Print Article
Next Story
More Stories