కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తిన యనమల

HMTV
By HMTV
Published on: 2020-08-11 05:48:10

అమరావతి : యనమల రామకృష్ణుడు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత

కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు

నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు

ఉపాధి కల్పనకు, భవిష్యత్ తరాలకు ప్రయోజనం లేదు

ఈ పాలసీ కోసమా 14నెలల విలువైన కాలం వృధా చేసింది..?

వైసిపి నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ది

తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే..

ఈ 14నెలల్లో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు

చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సగం జీతాలే...

క్రెడిట్ రేటింగ్ పడిపోయింది-పెట్టుబడులు వెనక్కి పోయాయి

ఏపి బ్రాండ్ ఇమేజ్ ను వైసిపి నాయకులు నాశనం చేశారు

టిడిపి ఏడాదికి సగటున రూ 1066కోట్లు కేటాయిస్తే, వైసిపి పెట్టింది రూ 852కోట్లే..

బలహీన వర్గాల వారికి, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం కాలరాశారు

దీనికి తగిన మూల్యం వైసిపి చెల్లించక తప్పదు

HMTV

HMTV

Next Story