థియేటర్ వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

రాజమండ్రి :

నగరంలోని స్వామి థియేటర్ వద్ద సినిమా థియేటర్ వర్కర్లకు ఆదివారం నిత్యావసర సరుకులు, రూ. 500 నగదు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ హాజరై ఆయన చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా ధియేటర్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories