సోము వీర్రాజుపై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై అమరావతి మహిళా జేఏసీ & కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్

- సోము వీర్రాజును చూస్తే చదవక ముందు కాకరకాయ చదివిన తర్వాత కికరకాయ సామెత గుర్తుకు వస్తుంది

- పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత సోము వీర్రాజు గతంలో ఏం మాట్లాడమో గుర్తు లేకుండా మాట్లాడుతున్నారు

- సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ కార్యకర్తల కంటే వైసీపీ నాయకులే ఎక్కువ సంతోషపడుతున్నారు

- అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు

- మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం.... ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకోండి మేము సహకారం అందిస్తామని బీజేపీ నేతలు చెప్పలేదా ?

- చంద్రబాబు ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చారని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గం

- రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రజలు కారా.. వారివి ప్రజా సమస్యలు కావా..

- అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన లేఖను సోము వీర్రాజు వెనక్కి తీసుకుంటారా ?

- అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మరచిపోయారా ?

- మీ చేతితో ప్రాణం పోసుకున్న అమరావతిని ముఖ్యమంత్రి జగన్ చంపాలని చూస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ?

- రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటున్నప్పుడు కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదు ?

- రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ జోక్యం చేసుకోవాలి

Show Full Article
Print Article
Next Story
More Stories