ఆక్వాకల్చర్‌కు పురోగతి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

- ఆక్వా రైతుల తరఫున కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను

- రైతులకు రూ. 6,500 ఇచ్చినట్టే, ఆక్వా రైతులకు కూడా ఇచ్చే విషయం పరిశీలించాలని కోరుతున్నాను

- నాకు భద్రత కల్పించే అంశంపై హోం సెక్రటరీతో చర్చించాను

- రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది

- నాకు సమస్యే రాష్ట్ర ప్రభుత్వ భద్రతతో అన్న విషయం చెప్పాను

- ఈ వారాంతం వరకు నాకు కేంద్ర బలగాల భద్రత అందుతుందని నమ్ముతున్నాను

- దురదృష్టావశాత్తూ నేను నా నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి లేదు

- నేను ధైర్యం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, నా శ్రేయోభిలాషులు వద్దంటున్నారు

- సుమారు 24 పోలీసు స్టేషన్లలో నా అనుచరులు, వారి అనుచరులు వేర్వేరు కేసులు పెట్టారు

- ప్రభుత్వమే నామీద కక్షగట్టి వ్యవహరిస్తోంది.

- నేను స్పీకర్‌కు లేఖ రాసిన 20 రోజుల తర్వాత కేసులు పెడుతూ పోయారు

- నేను క్షేత్రస్థాయికి వెళ్లలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను

- అతిత్వరలో నాకు భద్రత వస్తుంది. అప్పుడే నా నియోజకవర్గానికి రాగలను

Show Full Article
Print Article
Next Story
More Stories