రేపటి నుండి కడపలో లాక్ డౌన్

HMTV
By HMTV
Published on: 2020-07-26 13:54:22

కడప : నగరంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమ‌వారం నుంచి కఠినంగా లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు డీఎస్పీ సూర్య‌నారాయ‌ణ తెలిపారు. 27 నుంచి నగరంలో 10 గంటల లోపు దుకాణాలు తెరించేందుకు అనుమతి ఇస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

10 గంటల తర్వాత దుకాణాలు మూసి వేయాలని ఆయ‌న సూచించారు. 10 గంటల తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగ కూడ‌ద‌ని దయచేసి కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఎవ‌రైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు.

HMTV

HMTV

Next Story