అమలాపురంలో కర్వ్యూ కఠినంగా అమలు: డీఎస్పీ షేక్ మాసుం బాష

అమలాపురం: పట్టణంలో ఏ ఒక్క షాపును తెరవకుండా, అలాగే ఎవరిని బయట తిరగకుండా కర్వ్యూ కఠినంగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ మాసూమ్ భాషా తెలిపారు.

- అమలాపురం సబ్ డివిజన్ లో సీఐ, ఎస్ఐ లు అందరూ కూడా సబ్ డివిజన్ అంతటా ఉదయం 6 గంటల నుంచి కర్వ్యూ ను అమలు చేస్తురన్నారు.

- ఎవరు కూడా ఈ 24 గంటలు షాపులు తీయవద్దు అని అనవసరంగా బయటికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, బైకులు సీజ్ చేస్తామని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- కొందరు అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యువత ఎవరైనా రోడ్డు మీద తిరుగుతూ కనబడితే వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అని డీఎస్పీ మాసుం భాష తెలిపారు.

- అమలాపురం పట్టణంలో కర్వ్యూ అమలును పట్టణ సీఐ బాజిలాల్ తో కలసి పరిశీలించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories