కరోనా కోరల్లో తెలుగు రాష్ట్రాలు విల విల!

HMTV
By HMTV
Published on: 2020-07-25 01:42:09

తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. తాజాగా.. తెలంగాణ గత 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఎనిమిది మంది చనిపోయారు. 1,007 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరుకోగా, మరణాల సంఖ్య 447కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,334 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,677 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,147 కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మరణించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 2,380 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,858కి చేరింది. వీరిలో కరోనా నుంచి 39,935 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 933 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 39,990 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

HMTV

HMTV

Next Story