అరకులోయలో ఒక రోజు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు

అరకులోయ: మండలంలో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ పిలుపు మేరకు లాక్​డౌన్ అమలవుతోంది. వర్తక వాణిజ్య దుకాణాలన్నీ మూతపడ్డాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు శుక్రవారమైనా సంతకు రాలేదు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

కరోనా వ్యాప్తిని కట్టడికై అరకులోయలో ఒక రోజు లాక్​డౌన్ అమలు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. వారపు సంత జరిగే శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల రాకపోకలను ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories