కేకే లైన్ రెండో ట్రాక్ ను పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషనర్

HMTV
By HMTV
Published on: 2020-07-23 04:45:34

విశాఖపట్నం: కేకే లైన్ లో రైల్వే సెఫ్టీ కమిషనర్ ఏకే రాయ్ పర్యటించారు. ఈ మార్గంలో రెండో లైన్ పనులను పరిశీలించారు. ఆ మార్గంలో గరిష్ఠంగా ఎంత వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చో ప్రత్యక్షంగా పరిశీలించారు. సెఫ్టీ కమిషనర్ రాయ్ వెంట వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

చారు మూలకుసుమ నుంచి జైపూర్ వరకు 20.704 కిలోమీటర్ల పొడవునా రెండో ట్రాక్ ను సెఫ్టీ కమిషనర్ పరిశీలించారు. కొత్తవలస కిరండల్ లైన్ లో జరుగుతున్న పలు ట్రాకుల పనులను సెఫ్టీ కమిషనర్ బృందం నిశితంగా పరిశీలించింది. 

HMTV

HMTV

Next Story