వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా

- ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినీ స్టార్లు, రాజకీయ నేతలు ఇలా కరోనా బారినపడుతున్నారు.

- ఇక ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే..

- తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు.

- గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపదుతున్న అయన కరోనా పరీక్షలు నిర్వహించుకోగా అందులో ఆయనకి కరోనా అని తేలింది.

- విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అయన పీఏ కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

- ప్రస్తుతం విజయసాయిరెడ్డి సెల్ఫ్ క్వారంటైన్‌లోకు వెళ్లిపోయారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు.

- వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories