కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రతలతో వ్యాపారాలు నిర్వహించాలి

HMTV
By HMTV
Published on: 2020-07-21 13:13:32

ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణములో వ్యాపారస్తులు మరియు పోలీస్ అధికారులతో రాజేంద్రప్రసాద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పెరిగిపోతున్న కరోనా వైరస్ పట్ల ఉయ్యూరు వ్యాపారస్తులు, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరు మాస్క్ లు ఉపయోగించాలని, సామాజిక దూరం పాటించి,వ్యక్తిగత శుభ్రత పాటించాలని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

కొందరు వ్యాపారస్తులు లాక్ డౌన్ టైమ్ ను ఉదయం 6గంటల నుండి 10 గంటలవరకు కాకుండా ఉదయం 6 గంటలనుండి 11 గంటలు మార్చాలని కోరారని, చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వ్యాపారులు కోరారని రాజేంద్రప్రసాద్ అన్నారు.



HMTV

HMTV

Next Story