నేటి నుంచి టైంస్లాట్ టోకెన్లు నిలిపివేత..

- కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానికి ఇదే నిదర్శనం...

- నాలుగైదు రోజు ల క్రితం సింగిల్ నెంబరు మీదుంటే పాజిటివ్ కేసులు ప్రస్తుతం రెండు దాటి మూడు నెంబర్లకు చేరాయి.

- తాజాగా టీటీడీలో 170 మంది వరకు పాజిటివ్ లు నమోదయినట్టు తెలుస్తోంది.

- తిరుపతిలో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా ప్రకటించారు.

- లేనిపక్షంలో ఇది మరింత తీవ్రరూపం దాల్చుతుందని ఆందోళన చెందుతున్నారు.

- శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

- తిరుపతి నగరంలో కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అలపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం అనగా జూలై 21వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories