శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

HMTV
By HMTV
Published on: 2020-07-20 02:58:37

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం నాడు జలాశాయానికి మరింత వరద నీరు వచ్చి చేరింది. ఈ సీజన్‌లో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణా అధికారులు కరెంట్ ఉత్పత్తి ప్రారంభించారు. 3 జనరేటర్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లేదు.

శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పీక్ లోడ్ అవర్స్‌ను బట్టి కరెంటు ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : 77,534 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం : 885 అడుగులుప్రస్తుతం : 840.90 అడుగులునీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలుప్రస్తుతం : 63.1940 టిఎంసీలుగా ఉంది.



HMTV

HMTV

Next Story