టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు

తిరుపతి: టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో గా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులో తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో టిటిడి 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.

- రెండేళ్ల పాటు ఉండే ఈ పదవిలో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్‌ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లేటెస్టుగా రెండోసారి డిప్యూటేషన్‌ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈవో కొనసాగాలని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories