విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు మెరుగైన సేవలు: ఎస్పీ విశాల్ గున్నీ

గుంటూరు: ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా జిల్లా పోలీసు శాఖ ఎప్పుడూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా గుంటూరు జిల్లా రూరల్ ఎస్పి విశాల్ గున్నీ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రూరల్ జిల్లా పోలీసు శాఖలో ఇప్పటివరకు 63 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వారిలో 25 మంది పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేడు నలుగురు కానిస్టేబుళ్లు విధులకు కూడా హాజరయ్యారన్నారు. కరోనాను లెక్కచేయకుండా ప్రజలకు అనునిత్యం సేవలు అందిస్తున్న హోంగార్డు స్థాయి నుండి అడిషనల్ ఎస్పీ స్థాయి ఉద్యోగులందరికి నా ధన్యవాదాలు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories