కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి

జగ్గంపేట: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గంపేట సిఐ వి.సురేష్ బాబు అన్నారు.

- జగ్గంపేటలో ఆటో ద్వారా మైక్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, దాని బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం

పాటించాలని, శానిటైజర్ లు వాడాలని కోరారు.

- సాధ్యమైనంత వరకు ఎవరికి వారు గృహ నిర్బంధంలో ఉండాలని అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దు అని సిఐ కోరారు.

- ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలం కావున మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

- ఇప్పుడు ఎదురయ్యే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు.

- ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐ టి.రామకృష్ణ, గండేపల్లి ఎస్ఐ తిరుపతిరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories